పచ్చని మచ్చ - A Spot that's not Spotted.

అన్నదాత - ప్రోగ్రాం దూరదర్శన్ లో వచ్చేది. అందులో రైతులు తీసుకోవలసిన జాగ్రతలు చెప్పేవారు. ఒక రోజు మా బామ్మగారు ప్రోగ్రాం చుస్తూ, "అయ్యో" అని తనలోతను అనుకున్నారు. "ఎందుకు అల అన్నావ్ బామ్మా" అని అడగగా , ఆవిడా తన చిన్ననాటి కబుర్లు (అంటే 1920s & 1930s) చెప్పేవారు. మా తాతగారికి దాదాపుగా 134 ఎకరాల భూమి ఉండేది (ఇప్పుడు లేదు అనుకోండి). అది కవులకు ఇచేసారు. ఐతే పంట మీద పురుగు పడో, ఎండాకాలం అకాల వర్శలవలనో లేక వర్షాకాలం వరదల మూలనో పంట చేతికి మొత్తంగా  వచ్చేది కాదు రైతన్నకు. అది మొదలు ఎందుకు అలా అని తెలుసుకోవటానికి చిన్నపుడు మా బామ్మగారిని తెగే ప్రశ్నలతో చవకొట్టే వాడిని. ఆవిడకి ముందు తంతు ముద్దోచినా, తర్వాత విడ వయసుకి విసుగుతెప్పించేది. ఒక రోజు చదువు కోకుండా ఆటలడుతుంటే మా అమ్మగారు నన్ను తెగ తిట్టి పడేసారు (బక్కపలచగా ఉంటాను అని నన్ను ఆనాడు కూడా చేయ్యిచేసుకోలేదు మా తల్లితండ్రులు). అప్పుడు మా బామ్మగారు పిలిచి "వరెయ్ ఈశ్వరా, బాగా చదువుకుని , మంచి ఉద్యోగం చేసి గొప్పవాడివి అవ్వాలిర" అని అన్నారు. అది మొదలు ప్రతి సరి ప్రతి పనిలో ముందు ఉండాలి అని decide అయిపోయా

 కాని ప్రతి సరి నన్ను ఒక్క ప్రశ్న మాత్రం కలచివసేది - 'మన పొట్ట నింపటానికి కష్టపడే రైతుకి దిక్కులేదా?అని' . కానీ ప్రతిసారి ఏదోక కారణంగా అది నిజమీ అయ్యింది - రైతన్నకు దిక్కులేకుండా పోయింది. రైతుని ఆదుకునే నాధుడే లేకుండా పోయాడు. మన పొట్ట నింపటానికి పగలనక, ఎండనక కస్టపడి పంటని అల్లరుముదుగా, చంటి పిల్లవలె కాపాడుకుంటూ పెంచితే, అది పూర్తిగా చేతికివస్తేకుడా రైతన్నకు మిగిలేది అరకొర సొమ్మే!!! మిగతాది అంత దళారులు, దొంగానాకోడుకులే తినేస్తారు.
నేను పెద్దియక మొదటి సారి ఒక మహానుభావుడు రైతన్నను ఆదుకుంట అని చెప్పి నా class -10 లో పాదయాత్ర చేసాడు. ఆయనే వై. ఎస్. రాజశేకర్ రెడ్డి గారు. ఒకేవక్క కారణం వై.ఎస్.ర ని నేను అభిమానించటానికి - రైతు ని ఆదుకుంట అని చెప్పి ఆ మాటను నిలపెట్టుకున్నాడు. కానీ ఇంతలో విధి వేరేకద రాసింది. ఆయన మనకు లేకుండా పోయారు.   

సరి కలియుగం లోని కలి ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. వర్షాలు లేవు, వితనలు లాటరీ విధానంలో పంచారు. పంచిన వితనలు లో కూడా కొన్ని నకిలివి! అన్నింటా రైతన్నను మోసం చెయ్యని వస్తువు ఏదన్న ఉంది అంటే అది కేవలం పురుగుల మందు మాత్రమె. సరే వితనలు దొరికాయి కదా అంటే, అవి నాటి పంట పండించటానికి జలసయాలలో నీరు లేదు. ప్రభుత్వం కరెంటు సరిగ్గా ఇవ్వదు.

దేవుడిని నాతో పాటు మీరందరూ కూడా కోరిక కోరండి. ఆంధ్ర ప్రదేశ్ రైతన్నను, దేశంలోని ప్రతి రైతన్నను కాపాడమని. రైతు ఇంట కన్నీళ్ళు ఉండకూడదని. సకాలంలో వర్షాలు పదాలని మొక్కండి. ముక్కోటి దేవతలను ఒక్కచోట చేర్చి మన అందరిని ఆసిర్వదించమని వీదేకుండం. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుండేది. అప్పుడే ధరలు అదుపులో ఉంటాయ్, ప్రతి పేదవాడు పొట్టనిండ తిండి తినగలదు కంటినిండా నిద్రపోగలడు.

గమనిక : మాది రైతు కుటుంబం కాదు. మాకు పొలాలు లేవు. ఊరిలో ఆస్తులు లేవు. ఐన సరే రైతు మనవడు. మాన తోటి వాడు. రైతుది మన సమాజంలో ఒక అమూల్యమైన ఉద్యోగం.

Share this

Related Posts

Previous
Next Post »